Posts

Showing posts with the label kcr

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది telangana state ministers suspense

Image
 తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల పర్యటన ముగించుకొని ఇవాళ హైదరాబాద్‌ రానున్న కేసీఆర్‌.. కేబినెట్‌ కూర్పుపై స్పష్టత ఇస్తారని తెరాస ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. కేసీఆర్‌, మహమూద్‌ అలీ ఇప్పటికే కేబినెట్‌లో ఉన్నందున.. మరో 16 మందికి అవకాశం ఉంటుంది. కేటీఆర్‌, హరీశ్‌రావుకు కూడా మంత్రివర్గంలో స్థానం ఉంటుందని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. మిగతా స్థానాల కోసం తెరాస ఎమ్మెల్యేల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. జనవరి 3లోగా మొదటి విడత మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆరు లేదా ఎనిమిది మందికి చోటు దక్కే అవకాశముంది. పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రెండు, మూడు విడతల్లో పూర్తిస్థాయిలో కేబినెట్‌ విస్తరణ చేసే దిశగా యోచిస్తున్నట్టు సమాచారం.

హుస్నాబాద్‌ ఎన్నికల ఆరంభ సభ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ husnabad trs meeting

Image
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎప్పటిలాగే తన సెంటిమెంట్‌ సభకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను ఎంపిక చేసుకున్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగే ఎన్నికల ఆరంభ సభ అదిరేలా మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్‌లు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఎన్నికలకు వెళ్లేందుకు ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. అదే ఊపుతో పాల్గొనే హుస్నాబాద్‌ సభను విజయవంతం చేయడం టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కీలకం కాగా.. ఇది ఎన్నికల తొలి ప్రచార సభ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరిచూపూ హుస్నాబాద్‌పైనే ఉంది. ఈ సభ భారీ స్థాయిలో ఉంటుందని, దీని ద్వారా నాయకులు, కార్యకర్తల్లో కేసీఆర్‌ ఉత్సాహాన్ని నింపుతారని పార్టీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండవసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ హుస్నాబాద్‌ నుంచి సమర శంఖం పూరించనున్నారు. ఇక్కడ మొదలు పెట్టిన ఎన్నికల సభలను నిరంతరాయంగా 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చే...

తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు . ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్‌ telangana cm kcr

Image
తెలంగాణ ప్రభుత్వం రద్దుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్‌ కాసేపటి క్రితం గవర్నర్‌ను కలిసి సమర్పించారు. ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్‌.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్‌ను కోరారు. గవర్నర్‌ సూచనను సమ్మతించిన కేసీఆర్‌.. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగేందుకు అంగీకరించారు. కేసీఆర్‌తో పాటు మంత్రివర్గ సభ్యులందరూ ఆపద్ధర్మంగా కొనసాగనున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ గవర్నర్‌ సూచనను అంగీకరించిన కేసీఆర్‌