Posts

Showing posts with the label trs

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది telangana state ministers suspense

Image
 తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల పర్యటన ముగించుకొని ఇవాళ హైదరాబాద్‌ రానున్న కేసీఆర్‌.. కేబినెట్‌ కూర్పుపై స్పష్టత ఇస్తారని తెరాస ఎమ్మెల్యేలు ఆశిస్తున్నారు. కేసీఆర్‌, మహమూద్‌ అలీ ఇప్పటికే కేబినెట్‌లో ఉన్నందున.. మరో 16 మందికి అవకాశం ఉంటుంది. కేటీఆర్‌, హరీశ్‌రావుకు కూడా మంత్రివర్గంలో స్థానం ఉంటుందని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. మిగతా స్థానాల కోసం తెరాస ఎమ్మెల్యేల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. జనవరి 3లోగా మొదటి విడత మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆరు లేదా ఎనిమిది మందికి చోటు దక్కే అవకాశముంది. పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రెండు, మూడు విడతల్లో పూర్తిస్థాయిలో కేబినెట్‌ విస్తరణ చేసే దిశగా యోచిస్తున్నట్టు సమాచారం.

హుస్నాబాద్‌ ఎన్నికల ఆరంభ సభ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ husnabad trs meeting

Image
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎప్పటిలాగే తన సెంటిమెంట్‌ సభకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను ఎంపిక చేసుకున్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగే ఎన్నికల ఆరంభ సభ అదిరేలా మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్‌లు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఎన్నికలకు వెళ్లేందుకు ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. అదే ఊపుతో పాల్గొనే హుస్నాబాద్‌ సభను విజయవంతం చేయడం టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కీలకం కాగా.. ఇది ఎన్నికల తొలి ప్రచార సభ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరిచూపూ హుస్నాబాద్‌పైనే ఉంది. ఈ సభ భారీ స్థాయిలో ఉంటుందని, దీని ద్వారా నాయకులు, కార్యకర్తల్లో కేసీఆర్‌ ఉత్సాహాన్ని నింపుతారని పార్టీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండవసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ హుస్నాబాద్‌ నుంచి సమర శంఖం పూరించనున్నారు. ఇక్కడ మొదలు పెట్టిన ఎన్నికల సభలను నిరంతరాయంగా 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చే...

105 మందితో తొలి జాబితా తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. మొత్తం 119 స్థానాలకు గాను 14 స్థానాల్లో అభ్యర్థుల ఖరారును పెండింగ్‌లో ఉంచారు.

Image
105 మందితో తొలి జాబితా ముఖ్యమంత్రి కేసీఆర్‌, 13 మంది మంత్రులు.. సభాపతి, ఉపసభాపతిలకు మొదటి విడతలోనే టికెట్లు ఆందోల్‌, చెన్నూరులలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు నిరాకరణ పెండింగ్‌లో మరో ఐదుగురు తాజా మాజీ శాసనసభ్యుల పేర్లు శాసనసభ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. 105 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను గురువారం ప్రకటించారు. మొత్తం 119 స్థానాలకు గాను 14 స్థానాల్లో అభ్యర్థుల ఖరారును పెండింగ్‌లో ఉంచారు. శాసనసభ రద్దయిన గంటలోనే అనూహ్యంగా అధిక శాతం మంది అభ్యర్థుల పేర్లను  ప్రకటించటం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా విపక్షాల కంటే ఆయన ఒక అడుగు ముందుకేసి వాటికి సవాలు విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా 13 మంది మంత్రులు, శాసనసభాపతి మధుసూదనాచారి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డిలకు మొదటి విడతలోనే టికెట్లు లభించాయి. తొలి జాబితాలో తాజా మాజీలైన ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లను ఇవ్వలేదు. చెన్నూరులో నల్లాల ఓదెలు స్థానంలో ఎంపీ బాల్క సుమన్‌ను, ఆందోల్‌లో బాబూమోహన్‌ స్థానంలో పాత్రికేయుడు చంటి క్రాంతికిరణ్‌ను అభ్యర్థిగా ప్రకటి...