Posts

నేడే హుస్నాబాద్‌లో కేసీఆర్‌ శంఖారావం ఇదే టీఆర్‌ఎస్‌ తొలి ఎన్నికల ప్రచార సభ 50 రోజుల్లో 100 ప్రజా ఆశీర్వాద సభలు: హరీశ్‌

Image
ముఖ్యమంత్రిగా అధికారులతో సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తూ ప్రగతి భవన్‌లోనే ఎక్కువ సమయం గడిపిన కేసీఆర్‌.. ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం హుస్నాబాద్‌ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఎన్నికల శంఖం పూరించబోతున్నారు. ప్రగతి నివేదన సభ విజయవంతం కావడంతో అదే జోష్‌లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించడానికి టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. 50 రోజుల్లో 100 సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వంద సభల్లోనూ పాల్గొంటానని కేసీఆర్‌ ప్రకటించారు. అందులో హుస్నాబాద్‌ సభ మొదటిది. ఈ సభ ఏర్పాట్లను గురువారం రాత్రి మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్‌లో కేసీఆర్‌ సభాస్థలికి చేరుకుంటారని తెలిపారు. ఇది చరిత్రాత్మక సభగా నిలవనుందని, పట్టణంలో 10 వేల మంది, చుట్టుపక్కల గ్రామాల నుంచి మరో 10 వేల మంది పాదయాత్రగా వస్తున్నారన్నారు. హుస్నాబాద్‌తో పాటు తెలంగాణలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరారు. అందరి చూపు హుస్నాబాద్‌ వైపు అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత తొలి ఎన్నికల సభకు వేదిక కానున్న హుస్నాబాద్‌పై రాష్ట్రంలోని అందరి దృష్టి పడింది. హుస్నాబాద్‌ పట్టణంలోని బస్‌ డిపో గ్ర...

కేసీఆర్‌ నిర్ణయానికి ఐదు కారణాలు 5 kcr reasons behind before elections

Image
మరో తొమ్మిది నెలల పదవీకాలం ఉండగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రతిపక్షాలు తమ పాలనకు అసహనంతో అడ్డు తగులుతున్నాయని, అందువల్లే ప్రజాకోర్టుకు వెళుతున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అయితే, ఆయన ముందస్తు ఎన్నికల నిర్ణయానికి అంతకు మించిన కారణాలేవో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. 1) మోదీ పట్ల వ్యతిరేకత 2) కాంగ్రె్‌సకు కాలూ చేయీ కూడగట్టుకొనే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడటం 3) వేసవి ఇబ్బందులు 4) శాసనసభ ఎన్నికల్లో నెగ్గి 2019 లోక్‌సభ ఎన్నికలకు వాతావరణాన్ని సిద్ధం చేయడం. 5) తనయుడిని ముఖ్యమంత్రిని చేయడం. ఈ ఐదు కారణాల వల్లే కేసీఆర్‌ ఏప్రిల్‌-మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలను నవంబరు-డిసెంబరుకు ముందుకు జరిపారని తెలుస్తోంది. మోదీ పట్ల వ్యతిరేకత దేశవ్యాప్తంగా మోదీ పట్ల వ్యతిరేకత తార స్థాయికి చేరింది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, పెట్రో ధరల విషయంలో మధ్యతరగతి ప్రజలు మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా ముస్లిములు మోదీని గద్దె దించేందుకు బీజేపీని గట్టిగా వ్యతిరేకించే శక్తులకు బేషరతుగా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పట...

చెన్నూర్ నుంచి బాల్క.. ఆందోళ్ నుంచి జర్నలిస్ట్ క్రాంతి

Image
తెలంగాణ ప్రభుత్వం రద్దుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్‌ కాసేపటి క్రితం గవర్నర్‌ను కలిసి సమర్పించారు. ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్‌.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్‌ను కోరారు. గవర్నర్‌ సూచనను సమ్మతించిన కేసీఆర్‌.. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగేందుకు అంగీకరించారు. కేసీఆర్‌తో పాటు మంత్రివర్గ సభ్యులందరూ ఆపద్ధర్మంగా కొనసాగనున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

హుస్నాబాద్‌ ఎన్నికల ఆరంభ సభ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ husnabad trs meeting

Image
అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎప్పటిలాగే తన సెంటిమెంట్‌ సభకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ను ఎంపిక చేసుకున్నారు. శుక్రవారం హుస్నాబాద్‌లో జరిగే ఎన్నికల ఆరంభ సభ అదిరేలా మంత్రి హరీశ్‌రావు, స్థానిక ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌కుమార్‌లు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఎన్నికలకు వెళ్లేందుకు ముందుగా అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. అదే ఊపుతో పాల్గొనే హుస్నాబాద్‌ సభను విజయవంతం చేయడం టీఆర్‌ఎస్‌ శ్రేణులకు కీలకం కాగా.. ఇది ఎన్నికల తొలి ప్రచార సభ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అందరిచూపూ హుస్నాబాద్‌పైనే ఉంది. ఈ సభ భారీ స్థాయిలో ఉంటుందని, దీని ద్వారా నాయకులు, కార్యకర్తల్లో కేసీఆర్‌ ఉత్సాహాన్ని నింపుతారని పార్టీ ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండవసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సీఎం కేసీఆర్‌ హుస్నాబాద్‌ నుంచి సమర శంఖం పూరించనున్నారు. ఇక్కడ మొదలు పెట్టిన ఎన్నికల సభలను నిరంతరాయంగా 50 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చే...

తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు . ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్‌ telangana cm kcr

Image
తెలంగాణ ప్రభుత్వం రద్దుకు గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలిపారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి ఆమోదించిన తీర్మానాన్ని కేసీఆర్‌ కాసేపటి క్రితం గవర్నర్‌ను కలిసి సమర్పించారు. ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్‌.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్‌ను కోరారు. గవర్నర్‌ సూచనను సమ్మతించిన కేసీఆర్‌.. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగేందుకు అంగీకరించారు. కేసీఆర్‌తో పాటు మంత్రివర్గ సభ్యులందరూ ఆపద్ధర్మంగా కొనసాగనున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ గవర్నర్‌ సూచనను అంగీకరించిన కేసీఆర్‌

(తెరాస) ఎన్నికల మేనిఫెస్టో కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.కేసీఆర్‌

Image
 తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధినేత కేసీఆర్‌ ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించడంతో పాటు, పార్టీ తరపున పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కె.కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ * కె.కేశవరావు(ఛైర్మన్‌) * ఏపీ జితేందర్‌రెడ్డి * జి.నగేష్‌ * ఈటల రాజేందర్‌ * టి.హరీష్‌రావు * జి.జగదీష్‌ రెడ్డి * తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ * అజ్మీర చందూలాల్‌ * టి. పద్మారావు * కొప్పుల ఈశ్వర్ * ‌పల్లా రాజేశ్వర్‌రెడ్డి * ఫరీదుద్దీన్‌ * పి.రాములు * గుండు సుధారాణి

ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసినా తెరాస 100 సీట్లు గెలుస్తుంది. తెరాస విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా తానే ఉంటానని,దేశంలో అతిపెద్ద బఫూన్‌ రాహుల్‌గాంధీ అని ఆరోపించారు. తెరాస

Image
పార్లమెంటు ఎన్నికల్లో భాజపాకు అండగా ఉంటారా? ఆ పార్టీ మమ్మల్ని ఆహ్వానించలేదు. ఎంఐఎంతో స్నేహంగా ఉండే పార్టీతో పొత్తులు ఉండనే ఉండవని అమిత్‌షా చెప్పాడు. మమ్మల్నే మోదీ వ్యతిరేకి అంటున్నారు. ఈ ఎన్నికలు పూర్తయితే మేం కేంద్రంలో మోదీ వ్యతిరేకా? కాంగ్రెస్‌ వ్యతిరేకా? అనేది తెలుస్తుంది. భాజపా నేతలు మాట్లాడితే అంతే ఉండదు. వారి కథ తెలీదా? ఉన్న సీట్లలో గెలిస్తే చాలా గొప్ప. మాటలకు ఎన్నైనా మాట్లాడవచ్చు. పొద్దున్నే ప్రధాని కావాలని నాకుంది. అయితానా? కలలు మస్తుగా ఉంటాయి. భాజపా సంగతి సత్తా తెలియదా? వారేదో మాట్లాతుంటారు. అది నిజమవుతుందా? సమాఖ్య కూటమి మాటేమిటి? ఇప్పటికే నేను చెప్పాను. ప్రధాని, 29 రాష్ట్రాల సీఎంల సమావేశంలోనూ వెల్లడించాను. కేంద్రం వద్దే ఎన్ని అధికారాలు పెట్టుకుంది. దేశంలో కేంద్రీకరణ పెరుగుతోంది. కేంద్రం వద్ద విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి ఎందుకు? ఇవన్నీ రాష్ట్రాలకు ఉండాలి. రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఎందుకు ఇవ్వరు? నా డిమాండ్‌ ఇలాగే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తే ముఖ్యమంత్రిగా తానే ఉంటానని, దీనిపై మరో ఆలోచనకు తావులేదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ...